శ్రీనివాస్ గౌడ్, సంతోష్ లకు కేసీఆర్ ప్రశంసలు
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 2.10 కోట్లసీడ్ బాల్స్ ను వెదజల్లిన వైనం
- గిన్నిస్ బుక్ రికార్డుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు స్థానం
- జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందన్న కేసీఆర్
ఈ సీడ్ బాల్స్ ను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించారు. వీటిని కొండలు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. గిన్నిస్ బుక్ రికార్డు జ్ఞాపికను కేసీఆర్ చేతుల మీదుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ సీఎం అభినందించారు.