కేసీఆరే కోర్టుకు వెళ్లి ‘దళితబంధు’ను ఆపుతారు: ఈటల
- దళితబంధు పథకంతో నా బొండిగ పిసకాలని చూస్తున్నారు
- దళితులను కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారు
- 40 ఏళ్లైనా రాష్ట్రవ్యాప్తంగా అమలు సాధ్యం కాదు
నాలుగేళ్లలో దళితబంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ 40 ఏళ్లైనా అమలు సాధ్యం కాదన్నారు. దళితులను కేసీఆర్ మొదటి నుంచి దగా చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పథకం అమలుకు రూ. 2.5 లక్షల కోట్లు అవసరమని, బడ్జెట్ లేకుండా పథకం అమలు ఎలా సాధ్యమని ఈటల ప్రశ్నించారు.