లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ సారథి రూట్ భారీ సెంచరీ
- టీమిండియా, ఇంగ్లండ్ రెండోటెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో భారత్ 364 ఆలౌట్
- ఫామ్ కొనసాగించిన రూట్
- సిరీస్ లో రెండో సెంచరీ నమోదు
- ఇంగ్లండ్ 118 ఓవర్లలో 358/8
ఓవర్ నైట్ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ జట్టును రూట్, బెయిర్ స్టో జోడీ ఆదుకుంది. బెయిర్ స్టో 57 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 23, మొయిన్ అలీ 27 ఓ మోస్తరుగా రాణించారు. అయితే సిరాజ్, ఇషాంత్ శర్మ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ కు అడ్డుకట్ట వేశారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ కు 4, ఇషాంత్ కు 3 వికెట్లు లభించాయి.
కాగా లార్డ్స్ లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. విరామ సమయంలో ఓ అభిమాని అచ్చం టీమిండియా ఆటగాళ్లలా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు. అతడ్ని చూసి భారత క్రికెటర్లు విస్మయానికి గురయ్యారు. అతడు టీమిండియా క్రికెటర్ లాగే మైదానంలో కలియదిరుగుతూ దర్శనమిచ్చాడు అతడిని లార్డ్స్ మైదాన సిబ్బంది వచ్చి బలవంతంగా బయటికి లాక్కెళ్లారు.