TRS: ఉత్కంఠ‌కు తెర‌.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో పోటీకి టీఆర్ఎస్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్

trs announces huzurabad bypoll candidate
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎవ‌రిని ఉప ఎన్నిక బ‌రిలోకి దింపుతుంద‌న్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న‌ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.  

గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని ఆ పార్టీ ప్ర‌క‌ట‌న చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో ప‌లు సార్లు అరెస్ట‌యి జైలుకెళ్లారని చెప్పింది. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధ‌తను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పింది.
Go Back to Shorts
TRS
Huzurabad

More Telugu News