హజ్ హౌస్ ల నిర్మాణం, క్రిస్టియన్ భవన్ పెండింగ్ పనులకు ఏపీ సీఎం జగన్ ఆమోదం
- మైనార్టీ శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్
- వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశం
- మైనార్టీలకు కొత్త శ్మశానాల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాలు
మైనార్టీల సబ్ ప్లాన్ కోసం రూపొందించిన ప్రతిపాదనలపై తగిన చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. ఇమామ్ లు, మౌజంలు, పాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలను చెల్లించాలని అన్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో హజ్ హౌస్ ల నిర్మాణానికి జగన్ ఆమోదం తెలిపారు. దీనికి తోడు... అసంపూర్ణంగా ఉన్న క్రిస్టియర్ భవన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీకి ప్రాధాన్యతనిచ్చి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. షాదీఖానాల నిర్వహణను ఇక నుంచి మైనార్టీ శాఖకు బదిలీ చేయాలని తెలిపారు.