ఇండోనేషియాలో కరోనా బీభత్సం.... భారత్ చేయూత
- డెల్టా వేరియంట్ విలయం
- గత కొన్నివారాలుగా అత్యధిక సంఖ్యలో కేసులు
- తీవ్ర సంక్షోభం నడుమ ఇండోనేషియా
- కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ పంపిన భారత్
ఈ నేపథ్యంలో, తన మిత్ర దేశానికి భారత్ చేయూతనిస్తోంది. నేడు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు అందించింది. భారత నావికాదళానికి చెందిన ఓ నౌకలో వీటిని ఇండోనేషియా రాజధాని జకార్తా తరలించారు. గత కొన్నివారాలుగా ఇండోనేషియాలో కరోనా డెల్టా వేరియంట్ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.