Andhra Pradesh: ఏపీలో మరో 2,498 మందికి కరోనా పాజిటివ్

 AP Corona Positive Cases and Deaths Update
  • గత 24 గంటల్లో 88,149 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 481 కేసులు
  • కర్నూలు జిల్లాలో 24 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 24 మరణాలు
  • 23,843 మందికి కొనసాగుతున్న చికిత్స
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా 2,498 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 481 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 336, పశ్చిమ గోదావరి జిల్లాలో 326, కృష్ణా జిల్లాలో 263, చిత్తూరు జిల్లాలో 245 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,201 మంది కరోనా ఉంచి కోలుకోగా, 24 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి నేటివరకు 13,178 మంది కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,44,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,07,201 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,843 మంది చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
Update

More Telugu News