కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై రేపు గెజిట్ నోటిఫికేషన్లు

Gazette notifications on Krishna and Godavari rivers will release tomorrow
  • నదీ బోర్డుల పరిధిపై రేపు స్పష్టత
  • మధ్యాహ్నం 1.30 గంటలకు గెజిట్ నోటిఫికేషన్లు
  • జల వివాదాల నేపథ్యంలో ప్రాధాన్యత
  • ఏడేళ్ల అనంతరం గెజిట్ నోటిఫికేషన్లు
కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ రేపు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వాస్తవానికి ఈ గెజిట్ నోటిఫికేషన్లను 2014లోనే విడుదల చేయాల్సి ఉండగా, అనేక అవాంతరాలతో ఇన్నాళ్లకు మార్గం సుగమం అయింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత ముదరడం కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టాన్ని అనుసరించి నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వచించగలదని కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా పేర్కొంది. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని వివరిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
Go Back to Shorts
Gazette Notifications
Krishna
Godavari
River Management Boards
Andhra Pradesh
Telangana

More Telugu News