Royal Enfield: పలు మోడళ్లపై ధరలు పెంచిన రాయల్ ఎన్ ఫీల్డ్
ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ పలు మోడళ్ల ధరలు పెంచింది. ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 మోడళ్ల ధరలు పెంచినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు బైకులను ఆటోమొబైల్ వర్గాల్లో 650 ట్విన్స్ గా పిలుస్తారు. ఈ రెండు మోడళ్లలో అన్ని వేరియంట్లకు ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గరిష్ఠంగా రూ.6,809 వరకు ధరలు పెంచినట్టు తెలుస్తోంది.
కాగా, 2021లో రాయల్ ఎన్ ఫీల్డ్ తన మోడళ్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ ఏడాది జనవరిలోనూ, ఏప్రిల్ లోనూ వీటి ధరలు పెంచింది. అంతేకాదు, మెటియోర్ 350 శ్రేణిలోని బైకుల ధరలు కూడా గరిష్ఠంగా రూ.3,146 వరకు పెరిగాయి.
కాగా, 2021లో రాయల్ ఎన్ ఫీల్డ్ తన మోడళ్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ ఏడాది జనవరిలోనూ, ఏప్రిల్ లోనూ వీటి ధరలు పెంచింది. అంతేకాదు, మెటియోర్ 350 శ్రేణిలోని బైకుల ధరలు కూడా గరిష్ఠంగా రూ.3,146 వరకు పెరిగాయి.