థియేటర్లలోనే దిగుతానంటున్న 'నారప్ప'
- వెంకటేశ్ తాజా చిత్రంగా 'నారప్ప'
- తమిళ 'అసురన్'కి రీమేక్
- థియేటర్ రిలీజ్ పైనే దృష్టి
- త్వరలో రానున్న స్పష్టత
ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఓటీటీ వైపు వెళుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే టాక్ బయటికి వచ్చేసింది. అయితే ఈ విషయంలో వెంకీ అభిమానులు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు త్వరలో థియేటర్లు ఓపెన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువలన ముందుగా థియేటర్లలోనే వదిలి, ఆ తరువాతనే ఓటీటీకి వెళదామని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చివరిగా ఏ నిర్ణయానికి వస్తారో చూడాలి మరి.