హీరో సూర్యకు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేతలు!
- సినిమాటోగ్రఫీ చట్టం-1952 సవరణపై సూర్య అభ్యంతరాలు
- ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఇటీవలే వ్యాఖ్య
- సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలన్న బీజేపీ
- లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
దీనిపై తమిళనాడు బీజేపీ విభాగం మండిపడుతూ సూర్యకు హెచ్చరిక చేసింది. సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలని చెప్పింది. అంతేగానీ, ఇతర విషయాలపై అనవసరంగా జోక్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేయకూడదని చెప్పుకొచ్చింది. సూర్య తన తీరును మార్చుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీజేపీ యువజన విభాగం నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.