Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్స్: కొత్తగా 3,464 పాజిటివ్ కేసులు

AP Covid Bulletin
  • గత 24 గంటల్లో 93,759 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 667 మందికి కరోనా
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు
  • రాష్ట్రంలో 35 మంది మృతి

ఏపీలో గడచిన 24 గంటల్లో 93,759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 597 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 4,284 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,779కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 18,96,818 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,46,716 మంది కోలుకున్నారు. ఇంకా 37,323 మంది చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News