నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి: సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం
- నిరుద్యోగుల సమస్యలపై స్పందించిన లోకేశ్
- మరోసారి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరిక
- ఉత్తుత్తి క్యాలెండర్ తో నిలువునా ముంచారని వెల్లడి
- సీఎం ముందు డిమాండ్ల చిట్టా
"గ్రూప్-1, గ్రూప్-2 విభాగాల్లో 2 వేల పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి 30 రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంజినీరింగ్ విభాగాల్లో 20 వేలకు పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టాలి. రెవెన్యూ శాఖలో 740 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 వేల నిరుద్యోగ భృతిని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువకుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి" అంటూ డిమాండ్ చేశారు.