భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయల్పడిన రాతియుగం నాటి చిప్పలు, సమాధులు!
- జిన్నెలగూడెంలో బయటపడిన నీటి తొట్టెలు, చిప్పలు
- నీటిని నిల్వ చేసుకునేందుకు ఉపయోగించి ఉంటారన్న చరిత్రకారులు
- పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
రాతి చిప్పలతోపాటు పొలాల పక్కన పరుపురాతి బండలపై తొలిచిన నీటి తొట్టెలు కూడా ఉన్నట్టు చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. నీటిని నిల్వ చేసుకునేందుకు ఆదిమానవులు ఈ తొట్టెలను ఉపయోగించి ఉంటారని, నీటిని తాగేందుకు రాతి చిప్పల్ని ఉపయోగించి ఉంటారని తెలంగాణ వారసత్వ శాఖ అధికారిగా గతంలో పనిచేసిన భానుమూర్తి పేర్కొన్నారు.