శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదు: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- వివాదాస్పదంగా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశం
- ఇటీవల కన్నుమూసిన మఠాధిపతి
- తెరపైకి రెండో భార్య
- వీలునామా రాశారంటూ వెల్లడి
- సామరస్య ధోరణిలో ప్రభుత్వం
బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పరమపదించడంతో వారసత్వ అంశం వివాదం రూపుదాల్చింది. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య తమ వద్ద కూడా వీలునామా ఉందని తెరపైకి రావడంతో నూతన మఠాధిపతి ఎంపిక వ్యవహారం సంక్లిష్టంగా మారింది. దీనిపై ప్రభుత్వం సంప్రదింపుల మార్గంలో ముందుకు వెళుతోంది.