Telangana: తెలంగాణలో తాజాగా 1,417 మందికి కరోనా పాజిటివ్

Telangana sees decline in daily corona cases
  • గత 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 149 కొత్త కేసులు
  • అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
  • రాష్ట్రంలో 12 మరణాలు
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత క్రమంగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో రెండు కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,546 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,10,834 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,88,259 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,029 చికిత్స పొందుతున్నారు.
Telangana
Corona Virus
New Cases
Deaths
COVID19

More Telugu News