హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ నుంచి కరోనాకు మరో ఔషధం.. డీజీసీఐకి దరఖాస్తు

Biophore seeks approval for Aviptadil from drug controller for emergency use in COVID
  • అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ
  • క్లినికల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
  • కరోనా బాధితులు త్వరగా కోలుకుంటారన్న బయోఫోర్
హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ నుంచి కరోనాకు కొత్త ఔషధం రాబోతోంది. కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు ఈ సంస్థ అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఔషధ వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.

 తాము అభివృద్ధి చేసిన వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ పెప్డైడ్ (వీఐపీ) అయిన అవిప్టాడిల్‌తో కరోనా బాధితులు త్వరగా కోలుకుంటారని బయోఫోర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని సంస్థ సీఈవో డాక్టర్ జగదీశ్ బాబు తెలిపారు. ఇదే కంపెనీ గతంలో ఫావిపిరావిర్ ఔషధాన్ని తీసుకొచ్చింది.
Go Back to Shorts
Biophore
Corona Virus
Hyderabad
Aviptadil

More Telugu News