ఏపీ సీఎం జగన్కు రఘురామ మరో లేఖ!
- ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- సీపీఎస్ విధానం రద్దు చేయాలి
- పాత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు కదా?
గత అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేసిన సమయంలో సీపీఎస్ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని రఘురామ గుర్తుచేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తానన్నారని, అందుకే ఆ ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఏడు రోజుల్లోనే ఈ హామీ నెరవేరుస్తామని చెప్పారని, ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. ఇప్పటికయినా జగన్ హామీని నిలబెట్టుకోవాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రఘురామ కోరారు.