భారత్ బయోటెక్కు 64 మంది కమెండోలతో సీఐఎస్ఎఫ్ భద్రత
- కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్
- హైదాబాద్ శివారులోని ప్లాంటుకు సీఐఎస్ఎఫ్ కమెండోలతో పహారా
- ఆదేశాలు జారీ చేసిన కేంద్రం
కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థపై ఉగ్రవాదుల కన్ను పడే అవకాశం ఉండడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు సంస్థలకు ఇలాంటి భద్రత కల్పిస్తూ వస్తోంది. పూణె, మైసూరులోని ఇన్ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్లోని రాందేవ్ బాబా పతంజలి సహా దేశవ్యాప్తంగా పది చోట్ల ఇలాంటి భద్రత కల్పించింది. తాజాగా భారత్ బయోటెక్కు సీఐఎస్ఎఫ్ కమెండోలతో భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.