జగన్ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ పై స్పందించిన రఘురామకృష్ణరాజు
- జగన్ పై వేసిన పిటిషన్ లో నా స్వార్థం లేదు
- జగన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో నిజం లేదు
- వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారు
ఈ సందర్భంగా రఘురాజు స్పందిస్తూ... జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్ వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని చెప్పారు. కోర్టులో జగన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. పైనున్న వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు. జగన్ వేసిన కౌంటర్ లో ఎలాంటి విషయం లేదని తెలిపారు. తన ఆరోగ్యం కోసం, తన బెయిల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు.