కరోనా బాధితుల్లో వైరల్ లోడును 99 శాతం తగ్గించే నాసల్ స్ప్రే.. భారత్లో తయారీకి సన్నాహాలు
- అభివృద్ధి చేసిన కెనడా బయోటెక్ కంపెనీ
- శ్వాసనాళాల్లో పాగా వేసే వైరస్ను సమూలంగా నిర్మూలించే స్ప్రే
- వినియోగానికి న్యూజిలాండ్, ఇజ్రాయెల్ అనుమతి
వైరస్ బారినపడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించగా 24 గంటల్లోనే 95 శాతం వైరల్ లోడు తగ్గినట్టు గుర్తించారు.72 గంటల్లో 99 శాతం మేర వైరల్ లోడును తగ్గించింది. బ్రిటన్ వేరియంట్పైనా ఇది సమర్థంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఔషధం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని పేర్కొన్నారు. ఈ ఔషధాన్ని భారత్లో ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ ప్రయత్నిస్తోంది. కాగా, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ప్రభుత్వాలు ఇప్పటికే దీని వినియోగానికి అనుమతి ఇచ్చాయి.