ఏ రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకే ఎందుకు?: సజ్జల
- ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు ఆపొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పింది
- అయినా తెలంగాణ పోలీసులు ఆపుతున్నారు
- తెలంగాణ వ్యవహారంపై కోర్టులను ఆశ్రయిస్తాం
ఏపీలోని కరోనా పేషెంట్లు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని... ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకే ఎందుకని ప్రశ్నించారు.ఈ అంశాన్ని మానవత్వంతో చూడాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించారని... సరైన మౌలికవసతులు కూడా లేని ప్రాంతాలను ఏపీకి ఇచ్చారని దుయ్యబట్టారు.