Peddireddi Ramachandra Reddy: బ్యాంకులు పేదల పట్ల సానుభూతి చూపించాలి: మంత్రి పెద్దిరెడ్డి

వైఎస్సార్ బీమా పథకంపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునే మంచి పథకం వైఎస్సార్ బీమా పథకం అని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ బీమా పథకం కింద 62.43 లక్షల మందిని నమోదు చేశామని, ఇంకా 55.53 లక్షల మందిని నమోదు చేయాల్సి ఉందని వివరించారు. బ్యాంకుల వద్దే భారీగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని పెద్దిరెడ్డి తెలిపారు. పేదల పట్ల బ్యాంకులు సానుభూతితో వ్యవహరించాలని సూచించారు.
Peddireddi Ramachandra Reddy
YSR Insurance Scheme
Review
Video Conference

More Telugu News