కొవిడ్ వేళ సాయానికి ముందుకొచ్చిన పాండ్యా బ్రదర్స్
- దేశంలో వేధిస్తున్న ఆక్సిజన్ కొరత
- సకాలంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న రోగులు
- 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ప్రకటించిన పాండ్యా బద్రర్స్
టీమిండియా ఆటగాడు, ఢిల్లీ కేపిటల్స్ బ్యాట్స్మన్ అజింక్య రహానే ఇటీవల 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చాడు. తాజాగా, క్రికెట్ బ్రదర్స్ హార్దిక్ పాాండ్యా, కృనాల్ పాండ్యాలు కూడా ముందుకొచ్చారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తున్నట్టు నిన్న ప్రకటించారు. వీటి ద్వారా కొవిడ్ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలపవచ్చు.