యంత్రాంగం విఫలమైంది... కాంగ్రెస్ శ్రేణులు రాజకీయాలు వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలి: రాహుల్ గాంధీ పిలుపు
- దేశంలో కరోనా స్వైరవిహారం
- ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
- ప్రజాసేవ ఎంతో ముఖ్యమని వెల్లడి
- ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి
- ఇది కాంగ్రెస్ విద్యుక్త ధర్మం అని వ్యాఖ్యలు
కాంగ్రెస్ సహచరులు అన్ని రాజకీయపరమైన కార్యకలాపాలను వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు సంపూర్ణ సహకారం అందిస్తూ వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇది కాంగ్రెస్ కుటుంబ విద్యుక్త ధర్మం అని స్పష్టం చేశారు.