కరోనా టైమ్ లో డేర్ చేస్తున్న వరుణ్ తేజ్!
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
- ముఖ్య పాత్రల్లో సునీల్ శెట్టి ... ఉపేంద్ర
వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని' రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సిద్ధు ముద్ద .. అల్లు బాబీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాలకి వెళ్లి అక్కడ బాక్సింగ్ లో శిక్షణ పొందాడు. ఇప్పటికే ఈ సినిమాను మొదలుపెట్టడంలో ఆలస్యమైపోయింది. అందువలన బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే ఇండోర్ సీన్స్ ను .. తక్కువమంది సిబ్బందితో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. ఆ దిశగా పనులు మొదలయ్యాయని అంటున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.