Corona Virus: దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం.. కొత్త‌గా 3,14,835 మందికి కరోనా

India reports 314835 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,59,30,965
  • 24 గంట‌ల సమయంలో 2,104 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 1,84,657
  • 13,23,30,644 మందికి వ్యాక్సిన్లు  
దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చింది. నిన్న‌ కొత్త‌గా 3,14,835 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,78,841 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,84,657కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,34,54,880 మంది కోలుకున్నారు. 22,91,428 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,23,30,644  మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 27,27,05,103 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న16,51,711 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News