తిరుమలలో తగ్గిన భక్తులు, హుండీ ఆదాయం!
- నిన్న 30 వేల మందికి దర్శనం
- హుండీ ద్వారా రూ. 1.60 కోట్ల ఆదాయం
- ఆలయంలో నవమి వేడుకలకు ఏర్పాట్లు
ఈ బుధవారం జరిగే శ్రీరామనవమి వేడుకలను ఆలయంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. క్యూలైన్లను ఎప్పటిప్పుడు శానిటైజ్ చేస్తున్నామని, భౌతికదూరం పాటిస్తూ, స్వామిని దర్శించుకునే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కేసుల తీవ్రతను పరిశీలించిన తరువాత మరోమారు టీటీడీ బోర్డు సమావేశమై, తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.