భద్రాచలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Brahmotsavalu in Bhadrachalam Starts Today
  • ఈ నెల 27న ముగియనున్న ఉత్సవాలు
  • 21న శ్రీరామ నవమి
  • నిరాడంబరంగా వేడుకలు
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుంచి శ్రీరామ నవమి, తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు ఇవి కొనసాగుతాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు.

మరోవైపు, ఉత్సవాల నేపథ్యంలో 27వ తేదీ వరకు నిత్య కల్యాణాలను నిలిపివేశారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ ఉదయం మూలమూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.  ఈ నెల 21న ఉదయం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఉదయం సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రికి చంద్రప్రభ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ద్వాదశారాధనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 
Go Back to Shorts
Bhadrachalam
Lord Sri Rama
Brahmotsavalu

More Telugu News