ఆర్థిక సంవత్సరం చివరి రోజున... భారీ నష్టాల దిశగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ!
- సెషన్ ఆరంభంలోనే నష్టాలు
- 490 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- ఒత్తిడిలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు ఒకటి నుంచి నాలుగు శాతం వరకూ నష్టాల్లో నడుస్తుండగా, హెచ్సీఎల్ టెక్, ఎలక్ట్రా సిమెంట్స్, ఐటీసీ, టీసీఎస్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ తదితర కంపెనీలు అర శాతం నుంచి ఒకటిన్నర శాతం లాభాల్లో ఉన్నాయి. బ్యాంకులు, ఫైనాన్స్ సెక్టార్లలోని కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, టూరిజం, ఆటో హెల్త్ కేర్ రంగాల్లోని కంపెనీలు స్వల్పంగా లాభాల్లో ఉన్నాయి.