కర్ణాటక రాసలీలల సీడీ కేసు.. మాజీ మంత్రిని 5 గంటలపాటు విచారించిన అధికారులు
- ఉదయం పది గంటల సమయంలో విచారణకు హాజరు
- అధికారుల ప్రశ్నలకు మౌనాన్ని ఆశ్రయించిన మాజీ మంత్రి
- విచారణ అనంతరం అజ్ఞాతంలోకి
విచారణలో తొలి గంట తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, దీంతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, చివరి నాలుగు గంటలు మాత్రం ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన పెదవి విప్పలేదని సమాచారం. విచారణ అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు, సీడీలో కనిపించిన బాధిత యువతి నిన్న కోర్టుకు హాజరవుతారన్న వార్తలు వచ్చాయి. అయితే, రాత్రి వరకు ఆమెకు కోర్టు నుంచి అనుమతి లభించలేదని సమాచారం.