Kurnool District: నేడు కర్నూలు విమానాశ్రయం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్

  • పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించిన వైనం
  • 12.18 గంటలకు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం
  • అంతకంటే ముందు వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జగన్
YS Jagan today launch Orvakallu airport

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన విమానాశ్రయాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 11.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకునే జగన్ తొలుత జాతీయ జెండాను, ఆ తర్వాత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం 12.18 గంటలకు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరో కార్యక్రమంలో 12.22 గంటలకు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరిస్తారు. ఈ నెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. కాగా, ఈ విమానాశ్రయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించడం విశేషం.

More Telugu News