బైక్ లు, స్కూటర్ల ధరలను పెంచిన హీరో మోటోకార్ప్!
- ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి
- ఉత్పత్తి వ్యయం పెరగడమే కారణం
- రూ. 2,500 వరకూ ధరల పెంపు
ఇదే సమయంలో వినియోగదారులమీద ఎక్కువగా భారం మోపడం లేదని, సంస్థ ఖర్చులను సైతం తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టామని తెలిపింది. వివిధ రకాల బైక్ లపై ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 2,500 వరకూ పెరుగుదల ఉంటుందని చెప్పిన హీరో మోటో, ఏ వేరియంట్ పై ఏ మేరకు ధరను పెంచనున్నామన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. కాగా, మంగళవారం నాడు కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సైతం ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకుంది.