అత్తగారింట ఉన్నప్పుడు మహిళపై దాడి జరిగితే అందుకు భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు
- భర్తతో సహా అత్తింటివారు హింసిస్తున్నారన్న మహిళ
- గతేడాది పోలీసులకు ఫిర్యాదు
- ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్లిన భర్త
- హైకోర్టులో చుక్కెదురు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైనం
- బాగా తలంటిన సీజేఐ!
ఈ సందర్భంగా సీజేఐ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వేం మనిషివంటూ మండిపడింది. "భార్యను క్రికెట్ బ్యాట్ తో కొడతావా? నువ్వు కొట్టడం వల్లే అబార్షన్ అయిందని ఆమె చెబుతోంది. తనను చంపడానికి యత్నించావని అంటోంది. అత్తగారింట ఇతర కుటుంబ సభ్యులు చేసిన దాడిలో భార్య గాయపడితే ప్రధాన బాధ్యత వహించాల్సింది భర్తే" అని వ్యాఖ్యానించింది.
2020 జూన్ లో పంజాబ్ లుథియానాకు చెందిన ఓ మహిళ తనను భర్తతో పాటు అత్తింటివారు హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె భర్త తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.