Nagaraju: కేటీఆర్ పీఏనంటూ మోసాలు... మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

Task Force arrests former Ranji cricketer Nagaraju in cheating case
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పీఏగా చెప్పుకుంటూ నాగరాజు మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నాగరాజు అనేక కార్పొరేట్ ఆసుపత్రులు, వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి తనను తాను కేటీఆర్ పీఏనని చెప్పుకునేవాడని, ఆపై వారి నుంచి డబ్బు వసూలు చేసేవాడని టాస్క్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. నాగరాజు ఆ విధంగా రూ.39 లక్షలు వసూలు చేసినట్టు తెలుసుకున్నారు. అరెస్ట్ చేసిన సందర్భంగా అతడి నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ నాగరాజుపై పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. బెయిల్ పై వచ్చినప్పటికీ మళ్లీ మోసాలు చేయడం పరిపాటిగా మారింది. నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేట. విలాసాల మోజులో అతడు పెడతోవ పట్టినట్టు భావిస్తున్నారు.
Go Back to Shorts
Nagaraju
Arrest
Police
Task Force
Former Ranji Cricketer
KTR
TRS
Telangana

More Telugu News