సుప్రీంకోర్టులో అమరావతి భూముల పిటిషన్ పై విచారణ... సీబీఐ దర్యాప్తుకు అభ్యంతరం లేదన్న ఏపీ సర్కారు
- అమరావతి భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు
- సిట్ దర్యాప్తుపై స్టే ఇచ్చిన హైకోర్టు
- హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
- గత కొన్నినెలలుగా విచారణ
టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించగా, ఏపీ హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంను ఆశ్రయించడం తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోంది.