కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని మేం ఆంక్షలు విధించలేదు: ఎస్పీ విశాల్ గున్నీ
- ప్రభల అంశంలో నిన్న లోకేశ్ వ్యాఖ్యలు
- స్పందించిన గుంటూరు రూరల్ ఎస్పీ
- సంప్రదాయ ప్రభలపై ఆంక్షలు లేవని స్పష్టీకరణ
- కరోనా నిబంధనలు పాటించాలని సూచన
- మతాచారాలపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దని వెల్లడి
మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతకు విఘాతం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తిరునాళ్ల జరుపుకోవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. మతాచారాలకు సంబంధించిన అవాస్తవాలను ఎవరూ ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఏపీలో మార్చి 10న పురపాలక ఎన్నికలు జరగనుండగా ఆ మరుసటి రోజే శివరాత్రి పర్వదినం జరుపుకోనున్నారు.