ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా?: విజయసాయి రెడ్డి
- ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న టీడీపీ నేతలు
- రౌడీయిజం, ప్రలోభాలకు తెగబడుతున్నారు
- ఎస్ఈసీ చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా?
- ట్విట్టర్ లో విజయసాయి ప్రశ్న
అంతకుముందు మరో ట్వీట్ పెట్టిన ఆయన, "ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగా రాకపోతే ఓటమిని సమీక్షించుకుంటాం అని అంటారు ఎవరైనా. నాలుగో విడత 41.7% ఓట్లు పడ్డాయని సొల్లు మాటలు చెబ్తూనే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసాడు చంద్రబాబు. ఇతను మారడు. తను భ్రమల్లో జీవిస్తూ అందరినీ అదే భ్రాంతిలో ఉంచాలని చూస్తాడు" అని వ్యాఖ్యానించారు.