బలవంతపు ఉపసంహరణలపై అభ్యర్థులు ఫిర్యాదు చేస్తే పరిగణనలోకి తీసుకోండి: రిటర్నింగ్ అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు
- ఏపీలో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు
- బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై ఫిర్యాదులు స్వీకరించాలన్న ఎస్ఈసీ
- మార్చి 2 లోగా వివరాలు పంపాలని సూచన
- అసహజరీతిలో ఉపసంహరణ జరిగిందని తేలితే పునరుద్ధరిస్తామని వెల్లడి
అసహజరీతిలో నామినేషన్లు ఉపసంహరించినట్టు అధికారులు గుర్తిస్తే ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని వివరించారు. బలవంతపు ఉపసంహరణ జరిగిందని నిర్ధారణ అయితే, ఆ నామినేషన్లను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. నిమ్మగడ్డ తాజా ఆదేశాలతో... మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల ఫిర్యాదుల అంశంపై స్పష్టత వచ్చినట్టయింది.