ఉద్యోగుల అదనపు పనికి అదనంగా చెల్లించాల్సిందే.. కొత్త కార్మిక చట్టం?
- కొత్త కార్మిక చట్టం తీసుకొచ్చే దిశగా కేంద్ర సర్కారు
- ఇప్పటికే మీడియా దృష్టికి అంశాలు
- ఓవర్ టైమ్ పని చేస్తే సంస్థ వేతనం చెల్లించాల్సిందే
ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ మరో నూతన చట్టం తీసుకురావాలని భావిస్తోన్న నేపథ్యంలో మరో విషయం తెరమీదకు వస్తోంది. కంపెనీలో పనివేళలకు అదనంగా ఉద్యోగులు పనిచేస్తే (ఓవర్ టైమ్) కనుక అందుకు యాజమాన్యం అదనంగా వేతనం చెల్లించాల్సిందే. ఒక కార్మికుడు 15 నిమిషాలు అదనంగా పనిచేస్తే ఆ కాస్త సమయానికి కూడా కంపెనీ వేతనం చెల్లించాలని కొత్త చట్టం చెబుతోందని జాతీయ దినపత్రికలు పేర్కొంటున్నాయి. ఈ నిబంధనలను తీసుకువస్తే చట్టాల ద్వారా కార్మికులకు పని ఒత్తిడి తగ్గుతుందని, అంతేగాక, సంస్థ ఉత్పాదకత కూడా పెరుగుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది.