Vijay Sai Reddy: రెండో విడతలో అంతకుమించి విజయదుందుభి మోగింది: విజయసాయిరెడ్డి
ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. దీనిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. తొలి విడతలో 82 శాతం పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారని, రెండో విడతలో అంతకుమించి విజయదుందుభి మోగిందని పేర్కొన్నారు. జగన్ సంక్షేమ పాలనకు పంచాయతీలు పట్టం కడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పల్లెల్లో 10 శాతం ఓట్లు కూడా రాని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోందని, ఇక ప్రతిపక్ష హోదా కూడా బాబుకు గల్లంతేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.