ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 75 మందికి పాజిటివ్

AP Corona Update
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 34,864 కరోనా టెస్టులు నిర్వహించగా 75 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 11, విశాఖ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో ఒక కేసును గుర్తించారు.

అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,350 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,179 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,012 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7,159కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Update
COVID19

More Telugu News