మహిళల ఉపాధికి కొత్త పథకం... తెలంగాణలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్లు
- చేపలు, చేపల వంటకాల విక్రయాలకు సంచార వాహనాలు
- నేరుగా వినియోగదారుడి వద్దకే తాజా చేపలు
- జీహెచ్ఎంసీ పరిధిలో పంపిణీకి సన్నాహాలు
- 60 శాతం సబ్సిడీతో వాహనాల అందజేత
దేశంలో ఎక్కడాలేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతో పాటు, వాటి విక్రయం ద్వారా మహిళలు లబ్దిపొందేలా చేయడమే ఈ మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.