ప్రధాని మోదీ తమిళ సంస్కృతిని అర్థం చేసుకోవడంలేదు: రాహుల్ గాంధీ
- త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
- కోయంబత్తూరులో ప్రచారం ప్రారంభించిన రాహుల్
- మోదీపై విమర్శనాస్త్రాలు
- తమిళ భాషను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు
ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే భావన అనే మోదీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలోని ప్రజలందరూ ఒక్కరినే ఆరాధించాలని మోదీ కోరుకుంటున్నారని, అది కూడా తానే అవ్వాలని భావిస్తున్నారని అన్నారు. కానీ ఆయనకు తమిళ ప్రజల స్ఫూర్తి, సంస్కృతి, భాష అర్థంకావడంలేదని విమర్శించారు. తమిళ ప్రజలు కేవలం ప్రేమ, గౌరవం వంటి అంశాలకే స్పందిస్తారని, ఎందుకంటే తమిళులకు ఆత్మాభిమానం మెండుగా ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.