Bhuma Akhila Priya: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

Bhuma Akhila priya released from Chanchalguda prison
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొద్దిసేపటి కింద అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు చంచల్ గూడ జైలు వద్దకు చేరుకోవడంతో అక్కడ కొద్దిపాటి కోలాహలం కనిపించింది. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా అఖిలప్రియకు కోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి బోయిన్ పల్లి పోలీసుల ఎదుట హాజరవ్వాలని స్పష్టం చేసింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1 నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Bhuma Akhila Priya
Chanchalguda Prison
Release
Bowenpally Kidnap

More Telugu News