శబరిమలలో తెలంగాణవాసి మృతి
- మృతుడిది నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామం
- అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా ఛాతీలో నొప్పి
- ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు వదిలిన వైనం
నిన్న తెల్లవారుజామున అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా... తన స్నేహితుడి నుంచి విడిపోయాడు. ఆ తర్వాత ఛాతీ నొప్పి రావడంతో పక్కనే ఉన్న స్వాములకు చెప్పాడు. హుటాహుటిన ఆయనను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన ప్రాణాలు వదిలినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత నరేశ్ తో పాటు వెళ్లిన మరో స్వామికి ఆ విషయం తెలిసింది.
ఆయన ఆ విషయాన్ని ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు తెలిపాడు. నరేశ్ మృతి వార్తతో గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు, స్థానిక ఉన్నతాధికారులు, అక్కడున్న స్వాముల చొరవతో మృతదేహాన్ని స్వగ్రామానికి తెస్తున్నట్టు ఎంపీపీ నర్సప్ప తెలిపారు.