జనవరి 6న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన ఏపీ బీజేపీ

ఇవాళ ధర్మయాత్ర నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై దాడి జరిగిందని, కార్యకర్తలు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది. అయితే తమను రామతీర్థం ఆలయంలోకి బేషరతుగా అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీజేపీ రేపు (జనవరి 6) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది.

అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు, ఆర్డీఓ కార్యాలయాల ముందు బీజేపీ ఆందోళనలు నిర్వహిస్తుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

BJP
Agitation
Andhra Pradesh
Ramatjeertham

More Telugu News