‘ఆయుష్మాన్ భారత్’కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!
- ఇంతకాలం పథకం అమలును వ్యతిరేకించిన కేసీఆర్
- ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అమలుకు అంగీకారం
- ప్రధానమంత్రికి తెలియజేసిన సీఎస్ సోమేశ్ కుమార్
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి తెలియజేశారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.