Jagan: కేబినెట్ భేటీ సందర్భంగా సీఎస్ నీలం సాహ్నీని సత్కరించిన సీఎం జగన్

  • మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమావేశం
  • ఇళ్ల పట్టాలు, రైతు భరోసా వంటి అంశాలపై చర్చ
  •  కేబినెట్ భేటీకి హాజరైన సీఎస్ నీలం సాహ్నీ 
  • శాలువా కప్పి సీఎస్ ను గౌరవించిన సీఎం
  • ఈ నెలాఖరున పదవీవిరమణ చేయనున్న సీఎస్ 
CM Jagan chaired a cabinet meeting in secretariat

ఏపీ సీఎం జగన్ ఇవాళ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా సచివాలయంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ సీఎస్ నీలం సాహ్నీని సీఎం జగన్ కేబినెట్ భేటీ సందర్భంగా సత్కరించారు. ఈ నెలాఖరుతో నీలం సాహ్నీ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీకి విచ్చేసిన నీలం సాహ్నీకి సీఎం జగన్ పుష్పగుచ్ఛం అందించారు. ఆపై శాలువా కప్పి గౌరవించారు.  ఈ సందర్భంగా సీఎస్ నీలం సాహ్నీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News