Vijay Sai Reddy: ఇంతకీ 1995 నుంచి 3 దఫాలుగా సీఎంగా ఉన్నాయన ప్రారంభించి, పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా?: విజయసాయిరెడ్డి
పోలవరం ప్రాజెక్టు అంశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పోలవరం ప్రాజెక్టును కాలువలు తవ్వి, అనుమతులన్నీ తెచ్చి డాక్టర్ వైఎస్సార్ భుజాన మోస్తే, నేడు జగన్ పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే పోయారని పేర్కొన్నారు. ఇంతకీ 1995 నుంచి 3 దఫాలుగా సీఎంగా ఉన్నాయన ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా? అంటూ విమర్శించారు.